Politics5th Mar 12:52 PMSunil Byrisetty1 min read
బడ్జెట్పై స్పందించిన మాజీ సీఎం జగన్
కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్లు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబ
కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్లు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు.
బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు.
బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. ఆత్మస్తుతి-పరనింద అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు.
హామీల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని మండిపడ్డారు.
మొదటి బడ్జెట్లో హామీలకు కేటాయించిందేమీ లేదని, రెండో బడ్జెట్లోనూ అరకొర కేటాయింపులేనని జగన్ విమర్శలు చేశారు.