Politics19th Apr 01:31 PMSunil Byrisetty1 min read

రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్లమెంటులో అడుగు పెట్టే అవకాశం దక్కనుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపనున్

రాజ్యసభకు వైఎస్ షర్మిల?
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్లమెంటులో అడుగు పెట్టే అవకాశం దక్కనుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆ మేరకు హామీ ఇచ్చాకే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. షర్మిలను రాజ్యసభకు పంపే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగానే షర్మిలను రాజ్యసభకు పంపి ఎంపీని చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. వాటిలో ఒకటి షర్మిలకు దక్కనున్నట్లు సమాచారం.
YS Sharmila
Rajyasabha Member
Sharmila AP PCC President
Congress
కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల
వైఎస్ షర్మిలకు పార్లమెంటులో అడుగు
Scroll for the next article