Politics23rd Oct 05:22 PMSunil Byrisetty1 min read
ఆరోగ్యశ్రీ బకాయిలపై షర్మిల మండిపాటు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం బకాయిలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 19 ఏళ్ల ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇది దుర్దినమని, ఆసుపత్రులు బిల్లు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం బకాయిలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 19 ఏళ్ల ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇది దుర్దినమని, ఆసుపత్రులు బిల్లుల కోసం రోడ్డెక్కడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం 2700 కోట్లు బకాయిలు పెట్టి, సేవలు నిలిపేయడమే పేదలపై దాడి అని ఆమె అన్నారు. సర్జరీలు ఆగిపోవడంతో లక్షలాది రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆర్తనాదాలను పట్టించుకోవడం లేదని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వెంటనే బకాయిలు చెల్లించి, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ పథకం నిలిచిపోవడం వల్ల జరిగే మరణాలు ప్రభుత్వ హత్యలుగా పరిగణించబడతాయని హెచ్చరించారు.