Politics22nd Jun 01:54 PMSunil Byrisetty1 min read
యోగాంధ్రపై షర్మిల విమర్శలు
విశాఖలో ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్టకు చేరింది. యోగాంధ్ర
విశాఖలో ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్టకు చేరింది. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా? తిండీ తిప్పలు లేకుండా కడుపులు మాడ్చుతారా? వేలమంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా? గిరిజన బిడ్డలనే కదా ఈ ప్రభుత్వానికి చిన్నచూపు' అని 'X'లో పోస్ట్ చేశారు.