Politics9th Dec 12:35 PMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆవినాష్ ఫైర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆవినాష్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి పార్టీ కోటి సంతకాల సే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఆవినాష్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని, ఇప్పటివరకు తూర్పు నియోజకవర్గంలోనే 96 వేలకు పైగా సంతకాలు సేకరించామని తెలిపారు."ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 60 వేలకు పైగా సంతకాలు వచ్చాయి. ఇది ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న తీవ్ర అసంతృప్తిని చూపిస్తోంది" అని ఆవినాష్ ధ్వజమెత్తారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ప్రజలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. "గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాం. ఇప్పుడు ఆ పథకాలకు పేర్లు మార్చి, సక్రమంగా అమలు చేయడం లేదు" అని విమర్శించారు.అదనంగా, "డిసెంబర్ 8 దాటినా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేద"ని ప్రశ్నించారు. ఈ సంతకాల ఉద్యమం ద్వారా ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర, దేశ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.